చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి ని జరిపి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అనేకసార్లు జైలుకు వెళ్లారని భారతదేశాన్ని ఏక ఖండంగా ఉంచుట కొరకు 500 సంస్థానాలకు పైగా భారతదేశంలో విలీనం చేయటానికి ముఖ్య కారకులని ఈనాటి యువత ఆయన ఆశయాలను ఆయన జీవిత చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు అన్నపురెడ్డి లక్ష్మణ్ పట్టణ ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు ఓబీసీ నాయకులు ఊటీ కొండ నాగేశ్వరరావు ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ జె రాయుడు ఏ సుబ్బారావు ఘనంగా నివాళులర్పించారు