నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి మునయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక తల్లిదండ్రులు చెప్పడంతో స్థానికులతో కలిసి వారంతా ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.