ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రయాణికులతో నిండిన బస్సు నదిలో చిక్కుకుంది. రామ్ఢ్ గ్రామంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని బస్సు దాటుతుండగా నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో బస్సు ఒరిగిపోయింది.
అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు కిటికీల్లోంచి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం లేదు.