అంబర్ పేట ఇన్స్పెక్టర్ సుధాకర్ పై వనస్థలిపురంలో కేసు నమోదు అయింది. ల్యాండ్ వ్యవహారంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని ఎన్నారైకి మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఎమ్మార్వో ని సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి అతను డబ్బులు కొట్టేసినట్లు చెబుతున్నారు.
సస్పెండ్ అయిన ఆర్ఐతో కలిసి ల్యాండ్ వ్యవహారాన్ని ఇన్స్పెక్టర్ నడిపారు. ఎన్నారై నుంచి 54 లక్షల రూపాయలను తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇన్స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు చేసి వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట