36.2 C
Hyderabad
May 7, 2024 12: 26 PM
Slider చిత్తూరు

మహిళల్ని వేధించిన పోలీసులపై కేసు నమోదు

#harassing women

చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీసులు పొలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చారు. మహిళలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే లైంగికంగా వేధించి, కాటు వేశారని ఆరోపణ. ఈ విషయమై జరిగిన ప్రాధమిక విచారణలో లైంగిక వేధింపులు నిజమని తేలడంతో ఆరు మంది పోలీసుల మీదనే చిత్తూరు పోలీసులు కేసును నమోదు చేశారు.

ఈ అమానవీయ సంఘటన మీద పూతలపట్టు ఎస్సై హరిప్రసాద్, కానిస్టేబుల్ తనికాచలంతో పాటు మరో నలుగురిపై చిత్తూరు టూ టౌన్ పోలిస్ స్టేషన్ లో లైంగిక కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే గత కొన్నిరోజుల క్రితం కల్లూరు వద్ద భారీ చోరీ జరిగింది. అయితే దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పూతలపట్టు ఎస్సై హరిప్రసాద్ తన బృందంతో కలిసి తమిళనాడు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈ కేసులో పూమది, అయ్యప్పతో సహా 6 మందిని అరెస్టు చేశారు. అయితే ముఠాలో నలుగురు నిందితులు మహిళలే. విచారణ అనంతరం పోలీసులు ఇద్దరిని రిమాండ్‌కు పంపి మరో నలుగురికి నోటీసులిచ్చి పంపించారు. ఈ ముఠాలో నలుగురు మహిళల్ని ఏపీ పోలీసులు లైంగికంగా వేధించి హింసించారని తమిళనాడులోని క్రిష్ణగిరి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంచో చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డితో కృష్ణగిరి పోలీసులు మాట్లాడారు.

ఆ తర్వాత ఎస్పీ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం కృష్ణగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ప్రాథమిక నివేదక ఇవ్వాలని నగరి అర్బన్ సీఐ వాసంతికి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పూతలపట్టు ఎస్సై హరిప్రసాద్, కానిస్టేబుల్ తనికాచలంతో పాటు మరో నలుగురిపై చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసుపై చిత్తూరు డిఎస్పి శ్రీనివాసరావును విచారణ అధికారి గా నియమిస్తూ, పలు సెక్షన్ల కింద టూ టౌన్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు

Related posts

కారా మాస్టారూ… మమ్మల్ని వదిలి ఎలా వెళతారు?

Satyam NEWS

డీకే అరుణ, రామచందర్‌రావు గృహనిర్భంధం

Satyam NEWS

రైతుల భూమిలో రైతు వేదిక నిర్మాణం ఆపాలి

Satyam NEWS

Leave a Comment