ఎనెల్ ప్రివిలేజ్ కార్డు వల్ల నెల్లూరు ప్రజలకు లాభం చేకూరుతుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎనల్ ప్రివిలేజ్ కార్డును మంగళవారం ఎనెల్ ఆస్పత్రిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనెల్ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు ఉన్నాయని తెలిపారు.
వెయ్యి రూపాయలు చెల్లించి ప్రివిలేజ్ కార్డు తీసుకుంటే కుటుంబంలోని నలుగురు సభ్యులకు 10 నుంచి 20 శాతం వరకు రాయితీ లభిస్తుందని అన్నారు. ఆసుపత్రి యజమాని డాక్టర్ నాగేంద్రప్రసాద్ కు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మొయిళ్ళ గౌరీ, డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, వైసీపీ నేతలు, పలువురు పాల్గొన్నారు.