తిరుమల లో బాలుడి పై దాడి చేసి గాయపరిచిన చిరుతపులి ని అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. రెండు రోజుల అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి.
చిరుతపులి తిరుమల నడక దారి లో చిన్నారి బాలుడు కౌశిక్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. నడక దారిలో ఏడవ మైలు రిపీటర్ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.చిరుతను బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారుల ప్రయత్నం ఫలించింది.