మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసరలో పెద్ద ఎత్తున నిర్వహించిన రేప్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి తన ఫాంహౌస్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు.
ఈ రేవ్ పార్టీకి సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్ కు చెందిన విత్తన కంపెనీ డీలర్ లను ఆహ్వానించాడు. అందరిని ఖుషీ చేద్దామనుకున్న ఆ వ్యాపారి పెద్ద ఎత్తున అమ్మాయిలను కూడా రంగంలో దించాడు.
అమ్మాయిలతో చిందులు, సన్నిహితులతో విందులు అన్న చందాన సాగిన రేవ్ పార్టీ పై పోలీసులు దాడి చేసి బెస్ట్ క్రాప్ సీడ్స్ కంపెనీ మేనేజర్ ను అరెస్ట్ చేశారు.
అదే విధంగా 10 మంది అబ్బాయిలు, 6 గురు అమ్మాయిలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.