40.2 C
Hyderabad
May 5, 2024 17: 40 PM
Slider తూర్పుగోదావరి

కడియపులంకలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

#passionate lover

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. మీ కుమార్తెను ప్రేమిస్తున్నాను పెళ్లి చేయాలని లేకుంటే చంపేస్తాను అంటూ మూడు రోజుల కింద బెదిరించి మరీ ఆమె కుటుంబ సభ్యులపై సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సీఏ విద్యార్థిని, ఆమె సోదరీ, తల్లి తీవ్రంగా గాయపడ్డారు.అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కడియం సీఐ తిలక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ మూడు రోజుల క్రిందట కడియపులంక గ్రామానికి చెందిన పెనుమాక శ్రీనివాసరావుకి ఫోన్ చేసి బెదిరించాడు. మీ రెండో కుమార్తెను ప్రేమించానని పెళ్లి చేయాలని లేకుంటే తను మీ కుమార్తెను చంపేస్తానని హెచ్చరించాడు. శుక్రవారం రాత్రి శ్రీనివాసరావు ఇంటిపై గోడ దూకి సీఏ విద్యార్థిని శేష్మ నాగసాయి పై సుత్తి తో దాడికి ప్రయత్నించాడు. అడ్డుకుబొయిన ఆమె తల్లి ,అక్కలను గాయపరిచాడు.

నాగసాయి తల పై కూడా సుత్తితో మోదాడు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఎస్సై అమీనా బేగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని హత్యాయత్నం, ఆత్మహత్య ప్రయత్నం క్రింద కేసు నమోదైంది. నిందితుని వెంట నలుగురు యువకులు కూడా వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి పాత్ర పై కూడా దర్యాప్తు జరుపుతున్నారు.

బాధితులను పరామర్శించిన జక్కంపూడి, చందన

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన పెనుమాక శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త చందన నాగేశ్వర రావులు పరామర్శించారు వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.

Related posts

ప్రతి నిరుపేదను ఆదుకొని ఆర్ధిక సహాయం అందించాలి

Satyam NEWS

రేషన్ కార్డులు తొలగింపు నిజం కాదు

Satyam NEWS

తెలంగాణ భవన్ డిప్యూటీ కమిషనర్ పదవీ విరమణ

Satyam NEWS

Leave a Comment