అనర్హుల నుంచి రేషన్ కార్డులు రికవరీ చేస్తునట్లు వార్తలు రావడంతో యూపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. రేషన్కార్డుల సరెండర్పైనా, అనర్హుల నుంచి రికవరీపైనా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ కమిషనర్ సౌసబ్బాబు తెలిపారు.
రేషన్ కార్డు వెరిఫికేషన్ అనేది సాధారణ ప్రక్రియ అని ఆయన తెలిపారు. గృహ రేషన్ కార్డుల అర్హత లేదా అనర్హతకు సంబంధించి, అక్టోబర్ 7, 2014న ఆదేశాన్ని జారీ చేయడం ద్వారా ప్రమాణాలు సెట్ చేశారు. దీనిలో ఇంకా ఎటువంటి మార్పు చేయలేదు. ప్రభుత్వ పథకం కింద పక్కా ఇల్లు, విద్యుత్ కనెక్షన్, ఏకైక వెపన్ లైసెన్స్ కలిగిన వ్యక్తి, మోటారు సైకిల్ యజమాని, కోళ్ల పెంపకం, ఆవుల పెంపకం వంటి వాటి ఆధారంగా ఏ కార్డుదారుని అనర్హులుగా ప్రకటించరాదని స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారం 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ప్లాట్లు, ఇల్లు లేదా ఫ్లాట్ కలిగి ఉన్న వ్యక్తి కూడా రేషన్ కార్డు కలిగి ఉండటానికి అర్హులు కాదు. నాలుగు చక్రాల వాహనం, ట్రాక్టర్ లేదా హార్వెస్టర్ కలిగి ఉన్న వ్యక్తికి కూడా రేషన్ కార్డు ఉండదనే నిబంధన కూడా ఉంది. ఇది కాకుండా, తన ఇంట్లో ఎయిర్ కండీషనర్ ఉన్న వ్యక్తి రేషన్ కార్డు కలిగి ఉండటానికి అర్హులు కాదు.