41.2 C
Hyderabad
May 4, 2024 17: 10 PM
Slider కడప

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

#SudhakarReddy

కడపజిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని సోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోచంరెడ్డి సుధాకర్ రెడ్డి(37) అనే యువ రైతు అప్పుల బాధతో పురుగుల మందు త్రాగి మృతి చెందాడు. సుధాకర్ రెడ్డి కి ముగ్గురు పిల్లలు కావడంతో కుటుంబ పోషణ నిమితం భార్యతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుధాకర్ రెడ్డి గ్రామంలోని పలువురు వద్ద, బ్యాంక్ లలో అప్పు తీసుకొని వరి, మిరప, పత్తి, వంగ వంటి వివిధ పంటలు సాగు చేస్తూ జీవనం సాగించేవారు.

అయితే పంట సాగులో సరైన దిగుబడి రాకపోవడంతో వడ్డీ లు పెరిగి లక్షల రూపాయలు అప్పు కావడంతో తనకు ఉన్న పొలం ను అప్పు కోసం 1ఎకరా ఉంచుకొని మిగిలిన 8ఎకరాల భూమిని అమ్మాడు అయినా అప్పు తీరక పోవడం పిల్లలకు ఏమి ఆస్తులు లేవు అని మనస్తపం చెంది బుధవారం పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికులు, బందువులు 108 సహాయంతో వైద్యం నిమితం హాస్పెటల్ కు తరలించారు. చికిత్స పొందుతు గురువారం మృతి చెందాడు.

Related posts

5వ డివిజ‌న్ పోలింగ్ ప్ర‌క్రియను‌ ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్

Satyam NEWS

పరవళ్లు తొక్కుతున్న పాపాగ్ని నది

Satyam NEWS

రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కల్వకుర్తి రోడ్లు

Satyam NEWS

Leave a Comment