రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. చందుర్తి మండలం మూడపల్లి లో తండ్రి ఎదుటే ఒక యవతిని కొందరు కిడ్నాప్ చేశారు. హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన యువతిని శాలినిగా పోలీసులు తెలిపారు.
తండ్రిని కొట్టి శాలిని ని ఆ నలుగురు యువకులు లాక్కెళ్ళారు. ఫోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చిన యువకుడు పనేనని పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.