విధ్వంసకర వరదలు వచ్చి చాలా నెలలు గడిచినా పాకిస్తాన్ ఇప్పటికీ ఆర్థిక సంక్షోభం నుండి కోలుకోలేకపోయింది. ఐక్యరాజ్యసమితి సాయంతో నిధులు సేకరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. వరదల కారణంగా పాకిస్తాన్ పూర్తిగా నాశనమైంది. దాంతో వినాశకరమైన వరదల నుండి కోలుకోవడానికి సహాయం చేయాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ప్రపంచ దేశాలను కోరారు. దిగుమతులకు సంబంధించిన నిల్వలు లేకపోవడం, డాలర్ కొరత, అంతర్జాతీయ ద్రవ్యనిధి రుణ కార్యక్రమంలో జాప్యంతో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఈ నెలలో రూ.8,000 కోట్ల మేరకు చెల్లింపులు జరిగినప్పటికీ దీర్ఘకాలిక డాలర్ బాండ్లు కష్టతరమైన స్థాయిలో ట్రేడింగ్ను కొనసాగించడంతో దేశ రుణ సామర్థ్యంపై పెట్టుబడిదారులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్ లో వరదల కారణింగా 1,700 మందికి పైగా మరణించారు. దేశంలోని మూడవ వంతు మునిగిపోయింది. వరదల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.256,000 కోట్ల నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ ప్రభుత్వం IMFతో తన స్థూల ఆర్థిక సూచికలను నిర్వహించే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది. పాకిస్తాన్లో వినాశకరమైన వరదల తరువాత ప్రపంచ సమాజం తగినంత నిధులను అందించలేదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఈ కారణంగా ఐక్యరాజ్య సమితి ఆహార సహాయ కార్యక్రమాన్ని నిలిపివేయవచ్చు. పాకిస్తాన్ కు అవసరమైన నిధులలో కేవలం 30 శాతం మాత్రమే ఐక్యరాజ్య సమితికి సమకూరాయి. జనవరి 9న స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగే సదస్సులో మరిన్ని నిధులు కోరనున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ IMF నుండి రుణం పొందడం ఆలస్యం అవుతోంది.
పునరావాసం కోసం ఈ ఏడాది ఎంత ఖర్చు చేస్తారనే దానిపై IMF వివరాలను కోరింది. పాకిస్తాన్ ప్రస్తుతం కొత్త రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటుంది. ప్రతిపక్ష సభ్యుడు ఇమ్రాన్ ఖాన్ ఈ వారంలో నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలలో రెండింటిని రద్దు చేయాలని యోచిస్తున్నారు. ఇది కొత్త ఎన్నికలను ప్రకటించే అవసరాన్ని గుర్తు చేస్తున్నది.