అవినీతికి పాల్పడుతున్న ఒక సర్పంచ్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ షాదాన్ కళాశాల వద్ద ఈ ఘటన జరిగింది.
అవినీతికి పాల్పడుతున్న వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ సర్పంచ్ వినోద్ ను అవినీతి నిరోధక శాఖ అధికారుల రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అనుమతి కోసం 20 లక్షలు సర్పంచ్ డిమాండ్ చేశాడు.
అందులో 13 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. రాజేంద్రనగర్ షాదాన్ కశాశాల వద్ద రోడ్డు పై డబ్బులు తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.