ఇటీవలే ఏపీలోని విజయనగరం జిల్లా కు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్… ట్రాఫిక్ విభానికి సంబంధించి దాదాపు 11లక్షల విలువ చేసే ట్రాఫిక్ నియంత్రణ కు సంబంధించి పరికరాలను ఇచ్చారు.
వాటిని జిల్లా వ్యాప్తంగా అమర్చాలని రెండు రోజుల క్రితమే ఎస్పీ రాజకుమారీ.. ట్రాఫిక్ డీఎస్పీకి ఆదేశించారు కూడ.ఈ తరుణంలో అందులో కొన్నింటిని విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరం లో ట్రాఫిక్ పోలీసులు అమర్చారు.
ఈ మేరకు రద్దీ ఉన్న ప్రదేశాలను ,ప్రమాదాలు జరిగే స్థలాలను ,మలుపులను గుర్తించిన నగర ట్రాఫిక్ పోలీసులు వాటిని అమర్చారు. ప్రధానంగా ఎత్తు బ్రిడ్జి, ఆర్ అండ్ బీ బంగ్లా ,ఎస్పీ ఆఫీసు రోడ్డు, అలాగే మలుపులు తిరిగే రహదారుల వద్ద ఇ హార్డిల్స్ ను ఏర్పాటు చేసారు… నగర ట్రాఫిక్ పోలీసులు.
ఈ మేరకు ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు సూచనలతో ట్రాఫిక్ ఎస్ఐలు భాస్కరరావు,జియాయుద్దీన్ ,ప్రసాద్ ,హరిబాబు నాయుడు లు వాటిని అమర్చారు.