అనునిత్యం పనులతో ఎంతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక పార్లమెంటు సభ్యుడిని పేరుతో పిలిచి పలుకరించడం అంటే మామూలు విషయం కాదు. అదీ కూడా ఆ ఎంపి భారతీయ జనతా పార్టీకి చెందిన వారు కాదు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో జరిగిన ఈ సంఘటన అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు నేడు ఈ అనుభవం ఎదురైంది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వద్ద నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును పిలిచిన ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆప్యాయంగా పలుకరించారు. రాజు గారూ బాగున్నారా? అంటూ ప్రధాని ప్రశ్నించడంతో ఆయన కూడా ఒక్క సారిగా నిర్ఘాంత పోయారు. ఆయనతో కరచాలనం చేస్తూ రఘురామకృష్ణ రాజు భుజం తట్టిన ప్రధానమంత్రి ముందుకు సాగిపోయారు. రాజ్యసభ నుంచి తన చాంబర్ కు వెళుతూ ఉన్న సమయంలో సెంట్రల్ హాల్ లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో రఘురామకృష్ణ రాజు పక్కనే ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.
previous post