33.2 C
Hyderabad
May 14, 2024 12: 10 PM
Slider మెదక్

విలేజ్ డెవలప్ మెంట్ కమిటీలపై చర్యతీసుకోండి

#State Vice President

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్ మెంట్ కమిటీల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువై ముదిరాజ్ జాతిని టార్గెట్ చేసుకొని ముదిరాజులపైన కర్రతో రాళ్లతో దాడులు చేస్తూ గ్రామ బైస్కరణ చేస్తున్నారని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ముదిరాజ్ లకు న్యాయం చేయాలనీ ముదిరాజ్ మహాసభ మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ కోరారు.


ఈ రోజు మెదక్ జిల్లా చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కొక్కొండ మండలం రామన్న పేటలో పెద్దమ్మ దేవస్థానంకు సంబంధించిన భూమిని విలేజ్ డెవలప్ మెంట్ కమిటీకి ఇవ్వాలని ముదిరాజ్ సంఘానికి హుకుం జారీ చేశారని దేవాలయం భూమి ఇవ్వడం కుదరదని ముదిరాజులు చెప్పడంతో ఆగ్రహించిన వి.డి.సి కమిటీ సభ్యులు ముడిరాజులపై మూకుమ్మడిగా కర్రలతో రాళ్లతో దాడి చేసి గయా పర్చడమే కాకుండ గ్రామ బైస్కరణ చేశారని దాన్ని కండిస్తున్నామని జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.


గత నెలరోజులుగా ముదిరాజులను ఎవరోతో మాట్లాడకుండా కట్టడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సంఘటన పైన ప్రభుత్వం చర్యతీసుకోకుంటే రాష్ట్రంలో ఉన్న ముదిరాజులం కొక్కొండ గ్రామానికి వెళ్లి వి.డి.సి కి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నామని భరిస్తున్నారని దాడులు చేస్తే చూస్తూ ఉరుకోమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు కొత్త బాల్ రాజ్ ముదిరాజ్, ఇట్టబోయిన చంద్రం ముదిరాజ్ రాగిరి చందు ముదిరాజ్, రాగిరి నాగరాజు ముదిరాజ్, రాగిరి సాయి కుమార్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

Related posts

అయ్యా మా బతుకులు నాశనం చేయవద్దు

Satyam NEWS

ఈసీ, పోలీసులు, టీఆర్ఎస్ తీరుకు డీకె అరుణ ఉప‌వాస దీక్ష‌

Sub Editor

వైయస్సార్ సేవలు స్ఫూర్తిదాయకం

Bhavani

Leave a Comment