దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అన్నారు. వైయస్సార్ 14వ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు,నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఖమ్మం నియోజకవర్గ పిసిసి సభ్యులు మహ్మద్ జావేద్ లు వైయస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ఉమ్మడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. రైతులకు, విద్యార్తులకు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని అన్నారు.ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వైయస్సార్ స్ఫూర్తితో ముందుకు పోవాలని అన్నారు.
నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా పేరు తెచ్చుకొని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆనంతరం నగరం లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు