సీనియర్ బాలీవుడ్ నటుడు, డిస్కో డ్యాన్సర్ మిథున్ చక్రవర్తి ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజా సమాచారం ప్రకారం మిథున్ చక్రవర్తి ఇటీవల బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో మిథున్ అభిమానులు కంగారు పడ్డారు. ఆసుపత్రి బెడ్పై యన పడుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో ఆయన అపస్మారక స్థితిలో ఆసుపత్రి మంచం మీద పడి ఉన్నాడు. ఈ చిత్రాన్ని చూసి మిథున్ ఆరోగ్యం గురించి రకరకాల పుకార్లు వెలువడ్డాయి. ఆయన కుమారుడు మిమో చక్రవర్తి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. మిథున్ కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నాడని మిమో చెప్పారు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చెప్పాడు.