కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి నిర్మల్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాన్డీర్ షోరూమ్ యజమాని నూతనపల్లి రవీందర్ విరాళం ఇచ్చారు. తన వంతు సాయంగా ఐదు లక్షల రూపాయల చెక్కును ఆయన నేడు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖ్ కు అందచేశారు.
రాష్ట్రం కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండాలని ఈ చిన్ని సాయాన్ని అందించినట్లు నూతనపల్లి రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖ్ ఆయనకు అభినందనలు తెలిపారు.