కడప జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీలో ని పలు ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత మూడు రోజులుగా త్రాగునీరు సరఫరా కాకపోవడంతో జనం చుక్క నీటికోసం అనేక ప్రాంతాల కు పరుగు తీస్తున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అంతంత మాత్రమే చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బస్టాండు ఆర్ఎస్ రోడ్డు తోటపాలెం గాంధీనగర్ మెయిన్ బజార్ గ్రౌండ్ వీది తో పాటు ఇంకా అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండడం బాధాకరం.