నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ పీ. ఉదయ్ కుమార్ సభకు అధ్యక్షత వహించగా అదనపు కలెక్టర్ మను చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్ రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి ని శాలువతో సత్కరించి కరచాలనం చేసేందుకు కలెక్టర్ ఉదయ్ కుమార్ చెయ్యి చాపారు. అయితే వయసులో చిన్నవారైనా బాధ్యతలో పెద్దవారు కావడంతో కలెక్టర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వినమ్రంగా శ్రీనివాస్ రెడ్డి రెండు చేతులు ఎత్తి నమస్కరించారు. అదనపు కలెక్టర్ మను చౌదరి పూల మొక్క ఇచ్చి శ్రీనివాస్ రెడ్డి కి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీఓ హనుమానాయక్ తో పలువురు అధికారులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్