34.2 C
Hyderabad
May 11, 2024 21: 09 PM
Slider కడప

వైభవంగా అది శంకరాచార్యుల 1235 వ మహా జయంతి

#adishankaracharya

శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకర చార్య జన్మించి నేటికీ 1235 ఏండ్లు కాగా అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో మంగళవారం జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. 1235  ఏండ్ల క్రితం శుద్ధ పంచమి తిథిరోజు ఆది శంకరాచార్యులు జన్మించారు. ఈ తిధి సందర్భంగా మంగళవారం ఉదయం రాజంపేట శంకర మఠంలో పూజాది కార్యక్రమాలు  అద్వైత సమితి ఆధ్వర్యంలో అవధానం రాజశేఖర శర్మ, వేదపండితులు శ్రీ లక్ష్మి నరసయ్య, చోరగుడి దశరధ రామ శర్మ లతోపాటు  అద్వైత సమితి కమిటీ మెంబర్లు పీ వల్లభరావు, సోమశేఖర శర్మ, ఆర్ శ్రీకాంత్ పలువురు విశేష భక్తులు పాల్గొని  మంగళవారం గణపతి పూజ, రుద్రాభిషేకం, చండీహోమం నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి సందర్భంగా రద్దు చేసిన సామూహిక ఉపనయనాలు రానున్న శంకర జయంతులు సందర్బంగా పునఃప్రారంభించాలని బ్రాహ్మణ వటువులకు ఉచిత సామూహిక ఉపనయనాలు నిర్వహించాలని బ్రాహ్మణులు అద్వైత సమితి నిర్వాహకులను కోరారు

Related posts

లిజన్ కేర్ ఫుల్లీ: సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి

Satyam NEWS

మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు

Satyam NEWS

బ్రిటన్‌లో విజృంభిస్తున్న మరో వైరస్.. సర్వత్రా గందరగోళం

Sub Editor

Leave a Comment