30.7 C
Hyderabad
May 5, 2024 03: 35 AM
Slider ముఖ్యంశాలు

మరో వారం తర్వాతే ..

#supremecourt

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్‌పై నవంబర్ 28వ తేదీన తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 21న  తీర్పు ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం మరో వారంపాటు దాన్ని వాయిదా వేసింది.  ఈ మేరకు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్‌ రద్దు విషయం కూడా హత్య కేసు దర్యాప్తు బదిలీ అంశంతో ముడిపడి ఉన్నందున అదే రోజు విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Related posts

అమ్మకానికి అమరావతి: వచ్చే నెలలోనే వేలం, ఎకరానికి ఎంతంటే?

Satyam NEWS

పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్ష మొదలు

Satyam NEWS

Analysis: మళ్ళీ కోరలు చాస్తున్న కొత్త కరోనా

Satyam NEWS

Leave a Comment