అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో జనసేన బిజెపి సంయుక్తంగా నేడు ధర్మ పరిరక్షణ దీక్ష నిర్వహిస్తున్నాయి.
అందులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి ఆయన ధర్మ పరిరక్షణ దీక్ష చేస్తున్నారు.
పరిరక్షణ దీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ఈ దీక్ష చేపట్టడం గురించి ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దీక్షలకు అన్ని ఏర్పాట్లు జరిగాయని నాయకులు పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు.