39.2 C
Hyderabad
May 3, 2024 14: 11 PM
Slider నల్గొండ

మున్సిపల్ సమావేశం నిర్వహించాలని ఆందోళన

#hujurnagar

హుజూర్ నగర్ లో శుక్రవారం నుండి కాంగ్రెస్ కౌన్సిలర్ల  ఆందోళనలు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధి లో వి.పి.ఆర్ వెంచర్లలో లేవుట్ కింద మున్సిపాలిటీకి ఇచ్చిన 2,500 గజాల స్థలాన్ని ఆ వెంచర్ పెట్టిన యజమాని అమ్ముకున్నాడని,ఆ స్థలంను వెంటనే ఆ యజమాని నుండి స్వాధీనం చేసుకొని అతనిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,రాజా నాయక్ కమిషనర్  ఛాంబర్ లో కింద బైటాయించి గురువారం ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ సమావేశం నిర్వహించడంలో చైర్ పర్సన్,కమిషనర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, వార్డులలో సమస్యలు తిష్ట వేశాయని అన్నారు.ఎటువంటి పనులు చేయకుండానే లక్షలాది రూపాయలు కాజేశారని అన్నారు.వి.పి.ఆర్ వెంచర్ పై చర్యలు తీసుకోకుండా,మున్సిపాలిటీ సమావేశాలు నిర్వహించ కుంటే         శుక్రవారం నుండి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట రోజుకో రీతిలో విన్నుత నిరసనలు చేస్తామని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఉండలేవా పేరుతో పాటను ఆవిష్కరించిన ఎస్పీ రంగనాధ్

Satyam NEWS

పాక్ లో ఆర్ధిక సంక్షోభం: ప్రత్యర్థుల అరెస్టుల్లో పాలకులు బిజీ

Satyam NEWS

Скальпинг на форекс: Лучшая скальпинг стратегия для торговли на Форекс

Bhavani

Leave a Comment