ప్రజా సమస్యలపై స్పందించడం నాయకుల ప్రధమ లక్షణం. అదే కోవలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జీవనోపాధి కోసం సీతాఫలాలను సేకరించి రోడ్డుపై అమ్మేవారిని పలుకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి-యాపట్ల మార్గ మధ్యంలో తమ జీవనోపాధి కోసం అడవిలో సీతాఫలాలను సేకరించి కొందరు గిరిజనులు రోడ్డుపై కూర్చుని అమ్ముకుంటూ ఉంటారు.
అటుగా వెళుతున్న మాజీ మంత్రి జూపల్లి వారిని పలకరించి మార్కెట్ లో ఉన్న సీతాఫలాల డిమాండ్ గురించి, వాటిని సేకరించడానికి కూలీలకు ఎదురయ్యే సమస్యలను గురించిని అడిగి తెలుసుకున్నారు. సీతాఫలాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గిరిజనులు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఇలా వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలను ఆయన అభినందించారు. అనంతరం వారి సంతృప్తి కొరకు వారి నుంచి సీతాఫలాలు కొనుగోలు చేశారు.