మాజీ ఎమ్మెల్యే యరపతినేని నివాసాల్లో సీబీఐ తనిఖీలు చేస్తోంది. గుంటూరు, విశాఖ, హైదరాబాద్లో సీబీఐ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.
సున్నపురాయి అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణ కొనసాగుతున్నది. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లో 25 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. దాడుల్లో పలు డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్స్, నగదును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మైనింగ్కు సంబంధించిన 17 కేసులను సీబీఐకు సీఐడీ బదిలీ చేసింది. 2014 నుంచి 2018 వరకూ గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
శానిలైట్ ఇమేజెస్ అధారంగా అధికారులు మైనింగ్ ఆధారాలను సేకరిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.