29.7 C
Hyderabad
May 3, 2024 06: 56 AM
Slider గుంటూరు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఇళ్ల లో సీబీఐ తనిఖీలు

#YarapatineniSrinivasrao

మాజీ ఎమ్మెల్యే యరపతినేని నివాసాల్లో సీబీఐ  తనిఖీలు చేస్తోంది. గుంటూరు, విశాఖ, హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.

సున్నపురాయి అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ కొనసాగుతున్నది. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లో 25 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. దాడుల్లో పలు డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్స్, నగదును స్వాధీనం చేసుకున్నారు.

 అక్రమ మైనింగ్‌కు సంబంధించిన 17 కేసులను సీబీఐకు సీఐడీ బదిలీ చేసింది. 2014 నుంచి 2018 వరకూ గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

శానిలైట్ ఇమేజెస్‌ అధారంగా అధికారులు మైనింగ్ ఆధారాలను సేకరిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.

Related posts

పోలీసులపై వున్న నమ్మకానికి తగ్గట్లుగా పనిచేయాలి

Satyam NEWS

శ్రీరామనవమి ఘనంగా జరిగేలా ఏర్పాట్లు

Bhavani

అసభ్య కామెంట్ చేసిన అయ్యన్నపాత్రుడిపై కేసు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment