కరోనా పేరుతో విధించిన లాక్ డౌన్ కారణంగా వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఏఐటీయూసి నిరసన వ్యక్తం చేసింది. కడప జిల్లా రాయచోటి లో ఏఐటీయూసి ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది.
అనంతరం వారు డిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులకు ఉపాధి లేక, తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, వారి స్వస్థలానికి వెళ్ళడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని నిరసన కారులు డిమాండ్ చేశారు.