27.7 C
Hyderabad
May 4, 2024 07: 20 AM
Slider ప్రత్యేకం

టీడీపీ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

#ashok

గురజాడ ఇంటి నుంచీ కన్యకాపరమేశ్వరి టెంపుల్ వరకు నడిచిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు

దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు అంటే ఈ నెల 13 నుంచీ ప్రతీ ఒక్కరూ జాతీయ జెండా పట్టుకుని ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు… వాడవాడలా ఊరూరా… ప్రతీ నగరంలో అదే విధంగా ప్రతీ పల్లె లో మువ్వన్నెల జెండా ఎగురుతోంది.

అందులో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి సమక్షంలో పార్టీ శ్రేణులంతా జాతీయ జెండాను చేతబూనారు.ఈ మేరకు నగరంలో ని గురజాడ స్వగృహం నుంచీ కన్యకాపరమేశ్వరి టెంపుల్ వరకు తిరంగా ర్యాలీ కొనసాగింది.

టీడీపీ జెండా బదులు… మూడురంగుల తో కూడిన జాతీయ జెండాను పార్టీ నేతలంతా పట్టుకుని నగరంలో ప్రధాన రోడ్ల పై తిరిగారు.ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోకగజపతి రాజు మాట్లాడుతూ సాంస్కృతిక వైభవం ఫరిడవిల్లేందుకు ప్రతీ ఒక్కరూ పాటు పడాలన్నారు.

ఆజాదీ కా అమృత్ దినోత్సవం లో ప్రతీ ఒక్కరూ జాతీయ జెండాను పట్టుకుని… సంస్కృతి ని వారసత్వ సంపదను భావితరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ఆ పార్టీ మైనారిటీ విభాగ నేత అనువాద బేగం తదితరులు హాజరయ్యారు.

Related posts

సమంత ‘యశోద’ చిత్రానికి పాన్ ఇండియా హీరోల సపోర్ట్!

Bhavani

కాలుష్య రహిత సమాజం భావితరాలకు అందించాలి

Satyam NEWS

రైస్ మిల్ డ్రైవర్ల, యాజమాన్యం మధ్య చర్చలు విఫలం

Satyam NEWS

Leave a Comment