సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 7వ, వార్డు సభ్యురాలు వేముల వరలక్ష్మి నాగరాజు హరితహారంలో భాగంగా సోమవారం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వరలక్ష్మీ నాగరాజు మాట్లాడుతూ పర్యావరణం కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉందని,దీని వలన రాబోయే తరాల వారు కాలుష్య రహిత సమాజంలో స్వేచ్ఛగా జీవన ప్రయాణం చేయటానికి పచ్చని చెట్లు నాటడంతో ఏర్పడుతుందని తెలిపారు.
అందుకే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, అప్పుడే కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, రమేష్, గోపి, వినోద్, నాగేంద్ర బాబు, వేముల వెంకన్న,7వ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.