ఈ నెల 25వ తేదీ శనివారం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. ఛైర్మన్ ఎన్నికకు జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పరిశీలించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జెడ్పి సీఇఓ టి.వెంకటేశ్వర్రావు, డిప్యుటీ సీఇఓ కె.రామచంద్రరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు ఉదయం నామినేషన్లను స్వీకరిస్తారు.
ఉదయం 10 గంటలు నుంచి 12 గంటలు వరకూ నామినేషన్లను పరిశీలిస్తారు.
అనంతరం అర్హత పొందిన నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు.
మధ్యాహ్నం 1 గంట వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు.
అనంతరం 1 గంటకు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం, కో- ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఫలితాలను వెంటనే ప్రకటిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్, ఇద్దరు ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.