మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని ఎస్ రావు నగర్ డివిజన్ కమలానగర్ కాలనీలో రెబల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు నాంపల్లి రూప సుధాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రెబల్ యూత్ నిర్వాహకులు నాంపల్లి రూపా సుధాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజే శివ , యోగి , ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.