ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని, గోల్నాక డివిజన్ చే నంబర్ చౌరస్తాలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, చెదరాలను ఇతర వ్యర్ధాలను తొలగించాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ని కోరగా, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అక్కడ పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్