40.2 C
Hyderabad
May 1, 2024 16: 24 PM
Slider ఆధ్యాత్మికం

25 నుంచి శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవం

#Srinivasa Mangapuram

తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రం రోజున నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జరుగుతుంది. ఈ ఏడాది ఈ ఉత్సవాలు జూన్ 25 నుంచి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆల‌య ముఖ మండ‌పంలో జూన్, 25, 26, 27వ తేదీల్లో ఉదయం 9.00 నుంచి 10.30 గంటల వరకు  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

అదేవిధంగా రాత్రి 7.00 గంట‌లకు ఆల‌య ముఖ మండ‌పంలో స్వామివారిని మొదటిరోజు పెద్ద‌శేష వాహ‌నంపై, రెండో రోజు హనుమంత వాహనంపై, మూడో రోజు గరుడ వాహనంపై వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హిస్తారు.

Related posts

జెట్ స్పీడ్:ఆగమేఘాలపై కదులుతున్న కౌన్సిల్ రద్దు ఫైల్

Satyam NEWS

గ్రామ స్థాయిలో నాటుసారా నిర్మూలనకు “పరివర్తన – 2.0”

Satyam NEWS

నదీజలాలపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖాస్త్రం

Satyam NEWS

Leave a Comment