రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసాన్ని ఆగంతకులు మళ్లీ టార్గెట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు అంబానీ నివాసం గురించి వివరాలు అడిగారని, వాళ్ల దగ్గర బ్యాగులు ఉన్నాయని పోలీసులకు ఓ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ చేయడంతో ముంబైలో హైఅలర్ట్ ప్రకటించారు.
ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నివాసం అలజడి చెలరేగింది. అంబానీ నివాసం అంటిల్లాను గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేయడం సంచలనం రేపింది. ముంబై డీసీపీకి అనుమానాస్పద ఫోన్ కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను ఎన్ఐఏ ఈ కేసులో అరెస్ట్ చేసింది.
అంబానీ నివాసం ముందు పేలుడు పదార్ధాలు ఉన్న స్కార్పియోను సచిన్ వాజే పార్కింగ్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. అంబానీని బెదిరించడానికే ఈ కుట్ర చేసినట్టు గుర్తించారు. అయితే ఈసారి ముఖేశ్ అంబానీ నివాసాన్ని ఎవరు టార్గెట్ చేశారన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది.