తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామరావు జన్మించి వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న మినీ మహానాడును విజయవంతం చేయాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారన్నారు.
విద్యుత్తు, ఇంధన,నిత్యావసరాలు,ఆర్టీసీ ఛార్జీలు,చెత్త,ఇంటి పన్నులు ఇష్టానురాజ్యంగా పెంచేసి పేదలు, సామాన్యుల పై భారం మోపారన్నారు.ఈ నేల 19న జరిగే మినీ మహనడును ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కడియాల రమేష్,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్,రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు పంగులూరి ఆంజనేయులు చౌదరి,రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు,రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మీరవాలి,రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షుడు వెన్న బాలకోటి రెడ్డి,జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్,కుమ్మేత కోటి రెడ్డి,గట్టుపల్లి సత్యనారాయణ,గూడూరు శేఖర్ మాబు,బడే బాబు,కాండ్రతి సాంబయ్య,మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.