పల్నాడు జిల్లా నరసరావుపేట యువకులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపరచడం చాలా సంతోషంగా ఉందని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అన్నారు. గత నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలలో 7 మంది మునిసిపల్ బాయ్స్ హైస్కూల్ మరియు కేర్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధులు పతకాలు సాధించారు. వారు నేడు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలువగా, వారిని ఎస్పీ అభినందించారు.
భవిష్యత్తులో మరిన్ని పోటీలలో పాల్గొని విజయం సాధించి, తల్లిదండ్రులకు, గురువులకు,నరసరావుపేటకు, పల్నాడు జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో దక్షిణభారత దేశవ్యాప్తంగా నిర్వహించే టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు కూడా విద్యార్థులు అర్హత సాధించినట్లు కోచ్ బాలాజీ నాయక్ ఎస్పీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందు మాధవ్, కోచ్ బాలాజీ నాయక్, పల్నాడు టెన్నిస్ బాల క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పీకే రావు పాల్గొన్నారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా