అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్యమైన రామమందిర నిర్మాణంలో హిందూ జాతి మొత్తం భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశ్యం తో బృహత్తర కార్యక్రమం చేపట్టింది.
ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉడాకాలనీ బాబా మందిరంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యక్రమం నిర్వహించింది. ఈ మేరకు హిందూ బంధువులందరూ ఐక్యసమావేశం నిర్వహించారు.
మందిర నిర్మాణంనకు సంబంధించి ప్రజల నుంచీ తమ వంతు బాధ్యత గా నిధి సేకరణ సేకరణ మొదలు పెట్టారు. ఈ మేరకు పది రూపాయల నుంచీ నిధి సేకరణ చేపట్టారు.
ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ విభాగ్ వ్యవస్థా ప్రుముఖ్ పరమహంస ,ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ ,సాయిబాబ టెంపుల్ కార్యదర్శి మోహన్ రావు లు సంయుక్తంగా శ్రీరామజన్మభూమి మందిర నిధి సమర్పణ ఉద్యమంకు సంబంధించి బ్యానర్,కరపత్రం విడుదల చేసారు.
ఈ మేరకు సంఘ పెద్దలు మాట్లాడుతూ శ్రీరాముని మందిర నిర్మాణం జాతి ప్రగతికి సోపామన్నారు. 400 ఏళ్ల క్రితం పరాయిపాలనలో పడ్డ మందిర స్థలాన్ని ఇన్నాళ్లు సుప్రీంకోర్టు తీర్పు తో సాధించుకున్నామన్నారు.
ఈ నిధి సమర్పణ ఈ నెలాఖరువరకు జరుగుతుందని మాజీ తహశీల్దార్ సీహెచ్ వీ రమణమూర్తి తెలిపారు.