రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఈ నెల 23న విజయవాడలో నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఈరోజు విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల నేతలను ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు కలిశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు, జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ లకు ఆహ్వానాలు అందించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బి. వి. రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు పి. ప్రతాప్ రెడ్డి తదితరులు ఆహ్వానాలు అందించినవారిలో ఉన్నారు.