నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ మండల పరిధి లోని పలు దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను కరోనా వైరస్ కారణంగా మూసివేశారు. అక్కడకు వస్తున్న పర్యాటకులను అధికారులు తిప్పి పంపుతున్నారు.
ఈ సందర్భంగా అమ్రాబాద్ సిఐ బీసన్న తెలిపిన వివరాల ప్రకారం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా గల అమ్రాబాద్ మండల ఫరిధిలో గలా శ్రీశైలం, మద్దిమడుగు, ఉమామహేశ్వరం, సలేశ్వరం, మల్లెలతీర్థం దేవాలయాలతో పాటు పరహాబాద్, వ్యుపాయింట్, ఆక్టోపస్ వంటి పర్యాటక ప్రాంతాలను మూసివేశామని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, పర్యాటకులు మార్చి 31 వరకు రావొద్దని ఆయన తెలిపారు. ప్రజలు సహకరించి కృషిచేయాలని తెలిపారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చే వారిని మన్ననూర్ చెక్ పోస్టు వద్ద చెక్ చేసి వివరాలు తెలుసుకున్నాకే స్థానికులను లోపలికి అనుమతిస్తున్నారు. ఇతరులను మాత్రం వెనక్కి పంపుతున్నారు