27.7 C
Hyderabad
May 4, 2024 08: 36 AM
Slider ముఖ్యంశాలు

మణిపూర్ లో ఉన్న రాష్ట్ర  విద్యార్థులనందరినీ రప్పిస్తాం

#botsa

మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు నేపథ్యంలో, అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న రాష్ట్రానికి చెందిన  విద్యార్థులను గుర్తించి, వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు సుమారు వంద మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇంకా ఎవరైనా ఉంటే , రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ను సంప్రదించాలని సూచించారు. 

ఈ మేరకు విజయనగరంలోని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ, మణిపూర్ విద్యార్థుల సమస్యను ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెలామని, అక్కడ చదువుతున్న  విద్యార్థుల జాబితాను రూపొందించామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటాంమని హామీ ఇచ్చారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రితో కూడా మాట్లాడటం జరిగిందన్నారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని కోరారు. ఇంకా 50 మంది వరకు ఉండచ్చునని అంచనా వేస్తున్నామని, 150 మంది కి సరిపడ్డ విమానం ఏర్పాటు చేశామని తెలిపారు. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర లో వర్షపాతం ఉన్నప్పటికీ, పెద్దగా పంట నష్టం లేదని మంత్రి చెప్పారు.

అక్కడక్కడా మొక్కజొన్న, అరటికి కి కొద్దిగా నష్టం వాటిల్లిందని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో వివిధ పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఈ పనిలో నిమగ్నం అయ్యారని అన్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లా కి స్పెషల్ ఆఫీసర్ ని నియమించిందని, వారు జిల్లాల వారిగా సమీక్ష చేసి, పంట నష్టాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

పంట నష్టపోయిన ప్రతీ రైతుని ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇటీవల విడుదల అయిన టెన్త్ ఫలితాలు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది టెన్త్, ఇంటర్ ఫలితాలను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు తగిన యంత్రాంగం ఇప్పటికే పనిచేస్తోందని, ఫీజులు అధికంగా ఉంటే కమిషన్ కి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

తమ ప్రభుత్వ హయాంలో  ప్రైవేటు కంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో నే ఎక్కువమంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలను కల్పించడంతో, విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాను చెప్పారు. విద్యపై పెట్టే ఖర్చు అంతా రాష్ట్ర భవిష్యత్ కు పెట్టుబడిగా ముఖ్యమంత్రి భావిస్తున్నారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ రాష్ట్ర  శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు.

Related posts

కత్వ చెరువులో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిందే

Satyam NEWS

డాక్టర్ జిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అశ్విన్స్ స్పెషాల్టి ఆస్పత్రి

Satyam NEWS

మానవత్వం చాటుకున్న కృష్ణా జిల్లా పోలీసులు

Satyam NEWS

Leave a Comment