రాష్ట్రంలో తొలి మహిళా పార్క్….ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడల,సాంస్కృతిక శాఖా మంత్రి రోజా చేతుల మీదుగా విజయనగరం లో రాష్ట్రంలో నే తొలి సారిగా మహిళల కొరకు స్విమ్మింగ్ పూల్ తో మొట్టమొదటి మహిళా పార్క్ ను రాష్ట్ర క్రీడల ,మహిళా శాఖ మంత్రి ఆర్.కె.రోజా చేతుల మీదుగా ప్రారంభం కానుంది. గతంలో విజయనగరం లో న్యూపూర్ణ ఎదురు గా ఉన్న నాటి ప్రకాశం పంతుల గారి పేరు తో ఉన్న ప్రకాశం పార్క్ ను దాదాపు 3 కోట్ల తో “ప్రకాశం పంతుల గారి మహిళా”గా తీర్చి దిద్దారు. ఈ క్రమంలో విజయనగరం లో 8వ తేదీన కోట జంక్షన్ నుంచీ ర్యాలీగా మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో మహిళలచే సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మహిళల పార్క్ ను మంత్రి రోజా చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ రాత్రి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల పార్క్ ను అందులో సిద్ధమైన స్విమ్మింగ్ పూల్ ను, ఫౌంటెన్ ను పరిశీలించారు.