ములుగు సబ్ రిజిస్ట్రార్ పై వచ్చిన (వార్తలు) ఆరోపణలు సరైనవి కావని,వాటిని నమ్మవద్దని తస్లీమా అక్క అభిమాన సంఘాల నాయకులు అన్నారు. మంగపేట మండలానికి చెందిన గొప్ప వీరయ్య, కొంత మందితో కలిసి ములుగు సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుందని చేసిన అసత్యపు ఆరోపణలు సరైనవి కావని వారు అన్నారు.
మంగళవారం వెంకటాపూర్ మండల కేంద్రంలో తస్లీమా అక్క అభిమాన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎంతో మంది అనాధ అభాగ్యుల ఆకలిని తీరుస్తూ, అడవులలో కొండకోనల్లో నివసించే గొత్తికోయాలకు,నిరుపేద కుటుంబాలకు చేయూతనిస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న నేటి తరం మరో మదర్ థెరిస్సా తస్లీమా పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.
నిజాయితీ గల ఉన్నత అధికారిణిగా ఎంతో మంది ఉద్యోగులకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ,అనాధల ఆకలి తీరుస్తూ, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సబ్ రిజిస్ట్రార్ పై తప్పుడు అభియోగాలను వారు ఖండించారు.
సబ్ రిజిస్ట్రార్ పై అర్థరహిత వ్యాఖ్యలు చేసిన వారు బహిరంగ క్షేమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తస్లీమా అక్క అభిమాన సంఘాల నాయకులు మామిడి పెల్లి రమేష్, లావుడ్య సుఖ్రాం, రాసమల్ల హేమంత్,చంటి అనిల్, బొల్లవెని రాజ్ కుమార్,చంటి జాన్, అశోక్, సిద్దు, ప్రవీణ్, సిద్దు, సాయి తదితరులు ఉన్నారు.