25.7 C
Hyderabad
May 9, 2024 07: 14 AM
Slider జాతీయం

వీసా ఎండ్ :శ్రీలంక లో ఏడుగురు భారతీయుల అరెస్టు

7 indians arrest

వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేశారని మీడియా వర్గాలు తెలిపాయి. నెల రోజుల బిజినెస్‌ ట్రిప్‌ అని శ్రీలంకకు చేరుకుని గడువు దాటినా ఇక్కడే ఉన్న నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు తీరినప్పటికీ, అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్‌, ఎమ్మిగ్రేషన్‌ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసేవరకూ వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారని సమాచారం.

Related posts

కరోనా ఫోన్: ఖళ్లు ఖళ్లు దగ్గు ట్యూన్‌తో కాలయాపన

Satyam NEWS

బక్రీద్ ప్రార్ధనల్లో పాల్గొన్న అంబర్ పేట్ ఎమ్మెల్యే                      

Satyam NEWS

నవతరం పార్టీ చిలకలూరిపేట ఇన్ చార్జిగా బత్తుల అనిల్

Satyam NEWS

Leave a Comment