అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సి పి ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి తులసిదాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు.
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలోఆయన విగ్రహానికి పూల మాలాధారణ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించారని వారన్నారు, బ్రిటిష్ దోపిడి పీడనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపారు అన్నారు.
నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశసంపదను, ప్రజల సంపదలతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు చేస్తుందని విమర్శించారు. పాలకులు అనుసరిస్తున్న విధానాల వలన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, దీంతో ప్రజల జీవనం కష్టంగా మారిందని వారు విమర్శించారు
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి తిరుపతిరావు పార్టీ నాయకులు కొత్తకోట అప్పారావు, కె సూరయ్య, పి సతీష్, డి రమణ, బుజ్జి బాబు, బి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.