Slider ఆధ్యాత్మికం

ఘనంగా శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబా విగ్రహ ప్రతిష్ఠ

#kanthamaheswara

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి,సురమాంబా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం దేవస్థాన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్,ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బెల్లంకొండ రామచంద్రం గౌడ్,జై గౌడ్ జాతీయ అధ్యక్షుడు బూర మల్సుర్ గౌడ్,గరిడేపల్లి ఎంపిపి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ విగ్రహ,యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సలీమ రంజాన్ మాట్లాడుతూ గౌడ కుల దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి,సురమాంబా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గ్రామంలోని కంఠమహేశ్వర స్వామి ఆలయానికి తన వంతు ఆర్థిక సాయం చేయడం జరిగిందని ఆమె అన్నారు.

గౌడ కులస్థుల పైన స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు.ప్రతి గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి,సురమాంబా దేవాలయ నిర్మాణం జరుపుకోవాలని ఆకాంక్షించారు.స్వామి వారి అనుగ్రహంతో ప్రతి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.

అనంతరం కమిటీ సభ్యులు సర్పంచ్ సలీమ రంజాన్,తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్,పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామచంద్ర గౌడ్,జై గౌడ్ జాతీయ అధ్యక్షుడు మల్సూర్ గౌడ్, గరిడేపల్లి ఎంపిపి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ ని శాలువాలతో సత్కరించి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

భక్తుల ప్రాణరక్షణే ధ్యేయం

Bhavani

టూ లేట్ : సులేమానీని ఎప్పుడో చంపాల్సింది : ట్రంప్‌

Satyam NEWS

అవిశ్వాసంతో చైర్మన్ పదవి ఊస్ట్

Satyam NEWS

Leave a Comment