29.7 C
Hyderabad
May 3, 2024 04: 03 AM
Slider కృష్ణ

భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య

#killed

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను రెండవ భార్య కోసేసిన ఘటన నందిగామలోని అయ్యప్ప నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తొలుత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.

అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత వరమ్మ అనే మహిళను పెళ్లి చేసుకుని ముప్పాళ్ళ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం వీడియోలు చూస్తుండగా.. వరమ్మకు తీవ్ర కోపం వచ్చింది.

తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని భర్తపై మండిపడింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. దీంతో భర్త ఆనంద్‌పై బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాలను భార్య వరమ్మ కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి ఆనంద్‌ను కుటుంబ సభ్యులు తరలించారు.

మెరుగైన వైద్యం కోసం అతడిని విజయవాడకు తీసుకెళ్లారు. ఈ సంఘటన గురించి రెండో భార్య వరమ్మ మీడియాతో మాట్లాడుతూ.. మొదటి భార్య వీడియోలు చూసే సరికి కోపం వచ్చింది. ఇద్దరు కలిసి కొట్టుకున్నాం. జరిగిన గొడవలో తనను కూడా గాయలయ్యేల భర్త కొట్టాడని చెప్పింది. భర్తకు దెబ్బ తగులుతుందని తను అనుకోలేదని, అసలు ఎలా దెబ్బతగిలిందో తనకు తెలియదు అని చెబుతుంది. సడెన్‌గా అలా జరిగిపోయింది అని మీడియాకు వెల్లడించింది.

Related posts

జ‌ల్‌ప‌ల్లి క‌మాన్ ద‌గ్గ‌ర యువ‌తి దారుణ‌ హ‌త్య‌..

Sub Editor

T20 cricket: ఆస్ట్రేలియాకు చేరుకున్న గర్ల్ ఫ్రండ్స్

Satyam NEWS

చిరుపై తిట్ల దండకం చదివిన మెగా అభిమానులు

Satyam NEWS

Leave a Comment