రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా సినిమా ధియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా తొమ్మిది నెలలగా సినిమా హాళ్లు మూతపడిన విషయాలు తెలిసిందే.
కరోనా మార్గదర్శకాలను అన్ని థియేటర్ లు అనుసరించాల్సి ఉంటుంది.
మార్గదర్శకాల మేరకు మల్టీప్లెక్స్ లు, సినిమా హాళ్లు, థియేటర్ లు తెరుచుకుంటున్న సందర్భంగా తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏఎంబి సినిమాస్ ప్రకటించింది.
మార్గదర్శకాల ప్రకారం హాల్ లో ప్రేక్షకులకు ప్రేక్షకులకు మధ్య ఒక సీటును విడిచిపెడతారు. మొత్తం హాల్ లో 50 శాతం సీట్లు మాత్రమే బుక్ చేస్తారు. సిబ్బంది మాస్కులు, హెడ్ షీల్డ్స్ పెట్టుకుంటారు.
చేతికి గ్లౌజెస్ వేసుకుంటారు. అన్ని చోట్లా శానిటైజేషన్ చేస్తారు. ధియేటర్ లో సరైన వెంటిలేషన్, తాజా గాలి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.