విశాఖపట్నం, అక్కయ్యపాలెం, నర్సింహానగర్ లో అయ్యప్ప అంబలం పూజ ఘనంగా నిర్వహించారు. మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పూజ వైభవంగా నిర్వహించారు. ముందుగా అయ్యప్పస్వామి విగ్రహాన్ని వేణుగోపాలస్వామి ఆలయం నుండి మండపం వరకు డప్పు వాయిద్యలతో ఘనంగా ఊరేగించారు. అనంతరం ఫలాలు పూలతో నిర్మించిన మండపంలో అయ్యప్పస్వామి ప్రతిష్టించి అయ్యప్పస్వామూల నడుమ అత్యంత వైభంగా అయ్యప్ప అంబలం పూజ నిర్వహించారు.
అవినాష్ స్వామి,తరుణ్ స్వామి సమక్షంలో జరిగిన ఈ పూజలో అయ్యప్పస్వాములు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తమిళనాడు నుండి వచ్చిన శిల్పాకారుల చే గంధం తో అయ్యప్పస్వామి, వినాయకుడు,కుమారస్వామి,సాయిబాబా, అమ్మవార్ల విగ్రహాలను తయ్యారు చేయించారు.. భజన బృందం ఆలపించిన అయ్యప్ప పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.. స్వాములు, భక్తులకు నిర్వహకులు దాదాపు 30 రకాల వంటకాలు,టిఫిన్స్ తో ప్రసాద విందును ఏర్పాటు చేశారు..అవినాష్ స్వామి,తరుణ్ స్వామి లు నిర్వహించిన ఈ అయ్యప్ప అంబలం పూజ పట్ల.. అయ్యప్పస్వాములు,భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.